
విజయవాడ వరద బాధితులకు విరాళాల సేకరణ
హోళగుంద, న్యూస్,వెలుగు :మండల కేంద్రంలో బుధవారం విజయవాడ వరద బాధితుల సహాయ సమైఖ్య ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నందు విరాళాలు సేకరించారు.ఈ సందర్భంగా టీడీపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య మాట్లాడుతూ వాయుగుండం ప్రభావంతో విజయవాడలో కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి.దీంతో వరద బాధితులకు సాయం అందించాలనే లక్ష్యంతో విరాళాన్ని సేకరించడం జరిగిందన్నారు.అదేవిధంగా కులమత,రాజకీయ సంఘాలకు అతీతంగా కుటుంబ సభ్యులై వరద బాధితులకు భాద్యతగా ధన,ధాన్యాలు విరాళాలను అందించి మానవత్వాన్ని బ్రతికిద్దమన్నారు.అలాగే విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య,వైసిపి మండల కన్వీనర్ షఫీయుల్లా,బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద,బిజెపి మండల అధ్యక్షులు ప్రసాద్,మురళీధర్,చిన్నహ్యట శేషగిరి,తోక వెంకటేష్,సిద్దార్థ్ గౌడ,ఈసా, సి హెచ్ నాగరాజ్,నాగప్ప,శ్రీ రంగ,గిరి,ఆదాం,వార్డు సభ్యులు హమీద్, సుభాన్,అబ్దుల్ రెహమాన్,దుర్గయ్య,కన్న రావు,సిద్దప్ప,మోహిన్,షబ్బీర్,బుద్దెప్ప,జాకీర్,వెంకటేష్,అశోక్,వీరేష్,హనుమంతు,సినిమా మల్లి,భాస్కర్,అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు,ప్రజా సంఘాల నాయకులు,కులమతాలకు అతీతంగా పెద్దలు,యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.