
విద్యార్డులకు నోటు పుస్తకాలు అందజేత
ఆలూరు : హోళగుంద మండల పరిధిలో మంగళవారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పెద్దగోనెహాల్,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెబ్బటం గ్రామాల్లో విద్యార్థినీ,విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆదోని ఆధ్వర్యంలో నోట పుస్తకాలు అందజేశారు.దాదాపు 2000 పై చిలుకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సందీప్ రెడ్డి,సెక్రటరీ షైఫుల్ల,రోటరీ క్లబ్ సభ్యులు భరత్ షా,జీవన్ సింగ్,షణ్ముఖ,ప్రభాకర్ గౌడ్ మరియు మేఘనాథ్ రెడ్డి మరియు మండల విద్యాశాఖ అధికారులు సత్యనారాయణ, జగన్నాథ్ హాజరయ్యారు.అనంతరం రోటరీ క్లబ్ యాజమాన్యం సభ్యులను శాలువ, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,మండల విద్యా శాఖ కార్యాలయం సిబ్బంది లక్ష్మప్ప,పంపాపతి తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!