
విద్యార్థిని శ్రీలేఖ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలి
శ్రీలేఖ కుటుంబానికి 25లక్షల, గాయపడిన విద్యార్థులకు లక్షరూపాయలు ప్రభుత్వం చెల్లించాలి.
*రాయలసీమ రవికుమార్
*రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్
కర్నూలు న్యూస్ వెలుగు: నగరంలోని స్థానిక రాయలసీమ విద్యార్థి పోరాట సమితి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చెట్టు విరిగి విద్యార్థులు గాయపడగా శ్రీలేఖ అనే విద్యార్థిని చికిత్స పొందుతూ మరణించారని ఆ విద్యార్థిని మృతికి రాయలసీమ విద్యార్థి పోరాట సమితి తరపున ప్రాగాఢ సానుభూతి తెలియచేస్తున్నామని అన్నారు స్కూల్ లో అంతవరకు ఆడుతూ పాడుతూ తిరిగిన విద్యార్థులు చెట్టు విరిగి గాయపడటం,విద్యార్థిని శ్రీలేఖ మరణించడం దిగ్భ్రాంతి కరమని,అత్యంత బాధాకరమైన విషయమని గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని అన్నారు.
అలాగే ఆయన మాట్లాడుతూ సి.బెలగళ్ మండలం పొలకల్ జడ్పీహెచ్ ఎస్ స్కూల్ లో గాయపడి మరణించిన విద్యార్థిని శ్రీలేఖ కుటుంబానికి 25లక్షల పరిహారం,గాయపడిన విద్యార్థులు లక్ష రూపాయల పరిహారం అందచేసీ ఆదుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు అశోక్,వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.