
ప్రమాణాలు పాటించకుంటే అనుమతి రద్దు చేస్తాం: ముఖ్యమంత్ర్రి
తెలంగాణ : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగావకాశాలను మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. హైదరాబాద్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ)లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సరైన విద్యా మౌలిక సదుపాయాలు ఉండేలా రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీలపై కూడా గట్టి నిఘా ఉంచుతామని పేర్కొన్నారు . కనీస విద్యా ప్రమాణాలు పాటించని పక్షంలో ఇంజినీరింగ్ కాలేజీల అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించారు. బిఎఫ్ఎస్ఐ కంపెనీలతో సంప్రదింపుల తర్వాత ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించిందని, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేలోపు విద్యార్థులు కోర్సును పూర్తి చేయగలరని ముఖ్యమంత్రి చెప్పారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో దాదాపు 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.