
వివాహ కార్యక్రమాలకు హాజరైన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
పుట్టపర్తి : పుట్టపర్తి నియోజకవర్గంలో జరిగిన పలు వివాహ కార్యక్రమాలకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఆమడగూరు మండలం చినగానిపల్లి కి చెందిన
ఆంధ్రప్రదేశ్ వడ్డెర ఫెడరేషన్ మాజీ స్టేట్ డైరెక్టర్ కీర్తిశేషులు ఈసీ వెంకటేష్ కుమార్తె ఇ.తేజస్విని వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
పుట్టపర్తి రూరల్ మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన మురారి లక్ష్మినారాయణ కుమారుడు మురారి సురేష్ మరియు లావణ్యల వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆశీర్వదించారు. అనంతరం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో టీడీపీ కార్యకర్త శంకర్ సోదరుడి కుమారుడు సోము మరియు అమృత పెళ్లి వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.