
వృద్ధాప్య పెన్షన్ పంపిణీ చేసిన అధికారులు
న్యూస్ వెలుగు ఒంటిమిట్ట.01 : కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట మండలం నరవకాటి పల్లి పంచాయతీ రైల్వే స్టేషన్ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలలో భాగంగా అవ్వతాతలకు అందిస్తున్న పెన్షన్ను మంగళవారం గ్రామంలోని వృద్ధులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ సంక్షేమములో అభివృద్ధి కనపడడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు గఫార్ రహిమాన్, వెంకటయ్య, సుబ్బయ్య,, గోవిందు, గ్రామ వాలంటరీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
.
Was this helpful?
Thanks for your feedback!