
వైకుంఠనాధుడు అలంకారంలో శ్రీవేంకటేశ్వరస్వామి
తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పెద్ద శేషవాహనం పరమపద వైకుంఠనాధుడు అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. శ్రీదేవి, భూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని తొలిరోజు భక్తులు అధికసంఖ్యలో దర్శించుకున్నారు. పెద్దశేష వాహనసేవలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శనివారం ఉదయం చిన్నశేషవాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.
Was this helpful?
Thanks for your feedback!