
వైద్యరంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ చిట్టి నరసమ్మ
న్యూస్ వెలుగు కర్నూలు : ప్రజారోగ్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో (కృత్రిమ మేధస్సు) ఖచ్చితమైన ఫలితాలకు అవకాశం వుందని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పే చిట్టి నరసమ్మ అన్నారు. శనివారం మెడికల్ కాలేజీలోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో “ప్రజారోగ్య రీసెర్చ్ లో కృత్రిమ మేధస్సు పాత్ర” అనే అంశంపై ఇంటర్నీస్,పి.జి విద్యార్థులచే సెమినార్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ వైద్యరంగంలో ఇమేజింగ్ టెక్నాలజీ, డేటా అనలైజేషన్ మొ..విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర మంచి ఫలితాలను ఇస్తుందని రాబోవుకాలంలో ప్రజారోగ్యానికి అవసరమయ్యే ఏఐ ను ఉపయోగించుకొని చక్కటి ప్రణాళికలు రూపొందించుకోవచ్చుఅన్నారు. వైద్యులకు రోగుల సేవలో ఎ.ఐ ఎంతో ఉపయోగ పడుతుందని తద్వారా మరింత మెరుగైన సేవలు రోగులకు అందుతాయని అన్నారు. కమ్యూనిటీ మెడిసిన్ హెచ్.ఓ.డి డాక్టర్ పి. సుధా కుమారి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తక్కువ సమయంలో లక్షల మంది రోగుల డేటాను అనలైజ్ చేయవచ్చని తద్వారా ప్రజారోగ్యంలో మరింత ఖచ్చితత్వంగా ప్రణాళిక రూపొందించుకొని ప్రజలకు వైద్య సేవలు అందించవచ్చు అన్నారు. ఈ సెమినార్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అవసరమైన మేరకు ఉపయోగించుకోవాలని ప్రతిదానికి దాని మీదే ఆధారపడితే వైద్యులకు రోగులకు మధ్య హ్యూమన్ టచ్ మిస్ అవుతుందని, తద్వారా రోగులకు సంతృప్తి మిస్ అవుతుందన్నారు. ఏఐలో డేటా,సాంకేతిక తేడాలు వస్తే ఫలితాలు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని చర్చించడం జరిగింది. ఇంటర్నీస్ నిర్వహించిన ఈ సెమినార్ యందు ప్రొఫెసర్ సింధియా శుభప్రద, అసోసియేట్ డాక్టర్ అరుణ, అసిస్టెంట్లు/ డి.సి.హెచ్.యస్ లు డా. స్వర్ణ కుమారి, డా.రవి నాయక్, డా. వెంకటరమణ, డా. పుష్పలత, డా. ప్రవీణ, డా .వెంకటేశ్వర్లు,ఇంటర్నీస్(శ్రావణి, సాహితి),పీజీ వైద్య విద్యార్థులు ఈ సెమినార్ యందు పాల్గొన్నారు.