
వైద్య సౌకర్యాలు అందించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం
వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సాక్షిగా ప్రభుత్వంపై ఆగ్రహం
ఆసుపత్రులకు క్యూలో ఉన్న రోగులు…
వైద్య సౌకర్యాలు అందించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం
న్యూస్ వెలుగు,అమరావతి ;గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందించే లక్ష్యంతో గత ప్రభుత్వం ప్రతి గ్రామం పంచాయతీ పరిధిలో ప్రత్యేక వైద్య సేవలను అందించేందుకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టడమే కాకుండా వాటిని అమలు కూడా చేసింది. కరోనావంటి సమయంలో ప్రత్యేక వైద్య సేవలను ఇంటింటికి అందించినట్లు వైసిపి నేతలు చెప్పుకొచ్చారు. గత నెల రోజులకు పైగా రాష్ట్రంలో అనేక చోట్ల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గ్రామీణ ప్రాంతంలో అనేకమంది అనారోగ్యానికి గురవుతూ ఆసుపత్రిలో చేరుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో దీంతో ఎక్కడ చూసినా ప్రభుత్వ ఆసుపత్రులు కిక్కిరిస్తున్నాయి. ఆసుపత్రుల్లో రోగులకు సరైన వైద్య సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సాక్షిగా ప్రభుత్వంపై ఆగ్రహించారు. గత ప్రభుత్వంలో ఇంటింటికి వైద్యులను పంపించి వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారికి రిపోర్టులను కూడా అందించే వారిమని, గ్రామీణ ప్రాంతంలో సరైన మంచినీటి సదుపాయాలు లేక డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు సహా అనేక మంది ప్రజలు రోగాల బారినపడి ఆసుపత్రులకు చేరుతున్నారని వారికి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మన్యం ఏజెన్సీ ప్రాంతాలు సరైన వైద్య సౌకర్యాలు అందక చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారని వారు అన్నారు. ప్రభుత్వం వెంటనే వైద్య సౌకర్యాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.