
శ్రీ పోతలింగేశ్వర దేవస్థానం ముఖద్వారం ఏర్పాటు
హొళగుంద,న్యూస్ వెలుగు;మండల పరిధిలోని గజ్జహల్లి గ్రామంలో శ్రీ పోతలింగేశ్వర దేవస్థానం ముఖద్వారం సోమవారం ప్రారంభించారు. ఈ ద్వారాన్ని గ్రామంలోని దుశ్వాస రెడ్డి కుమారులు బోజ్జి రెడ్డి, యాంకప్ప రెడ్డి తమ సొంత ఖర్చుతో శ్రీ పోతలింగేశ్వర ఆలయ ముఖద్వారాన్ని నిర్మించారు. ప్రధాన రహదారి పై శ్రీ బసవేశ్వర దేవస్థానం సమీపన ఆలయానికి వెళ్లే మార్గంలో స్వాగత ద్వారాని నిర్మించారు. ఈ ద్వారానికి ఇరువైపుల ద్వార పాలకుల వలె జయ, విజయ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ద్వారం పై భాగాన సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ముఖ ద్వారం వెనకటి వైపు పార్వతీ ,పరమేశ్వరుల కుటుంబ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ ముఖద్వారానికి దాదాపుగా 8 లక్షలు ఖర్చయినట్లు దుశ్వాస రెడ్డి కుమారులు తెలిపారు. ఈ ముఖద్వారాన్ని గ్రామ పెద్ద మాజీ జెడ్పిటిసి తిమ్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పోతురాజు రామలింగ ఆధ్వర్యంలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిల్పకళ ఉట్టిపడే విధంగా ముఖద్వార స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.