సచివాలయ సిబ్బంది పోస్టులను  భర్తీ చేయాలి 

సచివాలయ సిబ్బంది పోస్టులను  భర్తీ చేయాలి 

హోళగుంద, న్యూస్ వెలుగు :మండలంలో ఖాళీగా ఉన్న పంచాయితీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని  పేదల ఇళ్ళ నిర్మాణానికి,గ్రామ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇసుక సరఫరాకు అనుమతి ఇవ్వాలని మంగళవారం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ శేషప్ప,ఎంపిపి తనయుడు ఈసా, ఎంపీటీసీలు మల్లికార్జున,మల్లయ్య,వైసిపి నాయకులు అశోక్ జిల్లా పంచాయితీ అధికారి నాగరాజు నాయుడును కలిసి వినంతి పత్రం సమర్పించారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన డీపీఓ నాగరాజు నాయుడు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!