
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
తణుకు న్యూస్ వెలుగు : తణుకులో జరిగే స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ప్రాంతం, రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్రంలో ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని రామానాయుడు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!