
సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు
మైలవరం,న్యూస్ వెలుగు ;
మైలవరం మండల పరిధిలోని వద్దిరాల, దోడియం, జంగం కాలనీలలో
కడప జిల్లా మలేరియా అధికారి మనోరమ PHC . వద్దిరాల ను సందర్శించి వైద్యాధికారుల కు సిబ్బందికి ఈ వర్షాకాలం లో వచ్చు కీటక జనిత వ్యాదులనివారణకు చేపట్టవలసిన కార్య్రమాలు,తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను తెలియ చేసారు ,ఆసుపత్రి ప్రయోగశాలను రికార్డులను తనిఖీ చేసారు.మంగళవారం జరిగిన ఆశ కార్యకర్తల సమావేశములో పాల్గొని వారికి కీటక జానీతవ్యాదుల పై అవగాహన రోజు విధిగా ఇంటింటి కి వెళ్లి వ్యాధుల పై నిఘా ఉంచి నివేదికలను వెంటనే తెలపాలని,ఆదేశించారు.
తర్వాత అదే గ్రామ పరిధిలోని వద్దిరాల లోని జంగమ కాలనీ వాసులను పరిశీలించి జ్వర పీడితులను పరామర్సించారు.గ్రామస్తులకు కీటక జనిత వ్యాధుల గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించారు, తర్వాత దొడియం గ్రామము సందర్శించి ఇటీవల చికెన్ గున్య సోకిన పూజారి. గంగులయ్య ను పరామర్శించి ఇంకా అలాంటి వారు ఉన్నారా..! అని ఆరా తీసి ఊరిలో అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమములో జిల్లా మలేరియా కార్యాలయం AMO వెంకట రెడ్డి ,స్థానిక వైద్యాధికారులు డాక్టర్ ప్రణీత్ కుమార్ , ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది, జమ్మలమడుగు సబ్ యూనిట్ ఆఫీసర్.N. నారాయణ రెడ్డి పాల్గొన్నారు.