స్కూలు అభివృద్దికి కృషి చేస్తాం

స్కూలు అభివృద్దికి కృషి చేస్తాం

కర్నూలు జిల్లా కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలోని నీలం రామచంద్రయ్య జెడ్పి ఉన్నత పాఠశాల
విద్యాకమిటి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని స్కూల్ ప్రదనోపాధ్యాయులు  తెలిపారు. స్కూలు ఛైర్మన్ గా డి మస్తాన్ నాయుడుని ఎన్నుకోగా , వైస్ ఛైర్మన్ గా M మౌనికను  ఎన్నిక తరువాత మొదటి సారి సమావేశం నిర్వహించినట్లు ఛైర్మన్ తెలిపారు. 

తమకి అవకాశం కల్పించినందుకు  ఛైర్మన్ మస్తాన్ , మౌనిక లు విద్యార్ది తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. స్కూలు అభివృద్దికి సహరిస్తామని వారు వెల్లడించారు. అనంతరం ఎన్నికైన ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ లను ఘనంగా సత్కరించినట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు  బీవీజీ మస్తాన్, నెరవటి విజయకుమార్, జానకిరాముడు, మధు, లక్ష్మన్న , బివిజి వెంకటేశ్వర్లు , బలోజీ సురేంద్ర, జనసేన నాయకులు బి వి జి సతీష్ కుమార్, శివ నాయుడు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!