
స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతీస్తున్నాం : డిప్యూటీ సీఎం
అమరావతి : తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వతంత్ర సిట్ విచారణ ద్వారా సత్యం వెలుగు చూస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డును సంస్కరించే భాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
Was this helpful?
Thanks for your feedback!