
ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం 1 లక్ష విరాళం
విజయవాడ, న్యూస్ వెలుగు ; శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ ప్రధానార్చకులు ఎల్ వి ఎస్ బద్రీనాథ్ బాబు కుటుంబసభ్యుల ద్వారా శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం కానుకగా 1 లక్ష రూపాయలను ఆలయ అధికారులను కలిసి దేవస్థానమునకు అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు.
Was this helpful?
Thanks for your feedback!