
పుట్టపర్తి లో ఘనంగా జయంతి వేడుకలు
పుట్టపర్తి న్యూస్ వెలుగు : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆశీస్సులతో శత జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించి దిగ్విజయంగా పూర్తి చేశామని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పేర్కొన్నారు. సత్య సాయి బాబా శతజయంతి వేడుకలు దిగ్విజయం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి మరియు సత్యసాయి ట్రస్ట్ సభ్యులకు మీడియా ప్రతినిధులకు సత్యసాయి కోట్లాదిమంది భక్తులకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో కలిసి సోమవారం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అనంతపురం పి వీ కేకే కళాశాల ప్రాంగణంలోని ప్రత్యేక కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. పుట్టపర్తి నియోజకవర్గం తొలి మహిళా ఎమ్మెల్యేగా సత్య సాయి బాబా శతజయంతి వేడుకలు నిర్వహించుకోవడం తాను ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. బాబా ఆశీస్సుల వల్లనే పెద్ద జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకొని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు , సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్ తో పాటు ట్రస్ట్ సభ్యులు ,రాష్ట్ర యంత్రాంగానికి ,జిల్లా యంత్రాంగానికి ,సత్యసాయి భక్తులకు,మీడియా ప్రతినిధులకు ,ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ శతజయంతి వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, భవిష్యత్తులో పుట్టపర్తి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్ర అభివృద్ధిలో సత్యసాయి సాయి భక్తులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పిలుపునిచ్చారు.


మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కోట్లాది ఆరాధ్య దైవమైన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు ఎంత ఘనంగా ప్రారంభమై ఎంతో దిగ్విజయంగా ముగిశాయని తెలిపారు. ఈ శత జయంతి వేడుకలు రాష్ట్ర పండుగగా నిర్వహించేలా స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లిన మరుక్షణమే స్పందించి సత్యసాయి శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి ఉత్తర్వులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సత్యసాయి ఆశీస్సులతో పుట్టపర్తిలో శతజయంతి ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి వివిఐపీలు వీఐపీలు ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి శతజయంతి వేడుకల్లో పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు. ఇక్కడికి విచ్చేసిన సత్యసాయి భక్తులకు ప్రముఖులకు మీడియా ప్రతినిధులకు రాష్ట్ర యంత్రాంగానికి జిల్లా యంత్రాంగానికి , డీఐజీ సీమోషి ,జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో అన్ని శాఖలు భాగస్వాములై అహర్నిశలు కృషిచేసిన సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్ తో పాటు మిగతా సభ్యులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

