
బస్సు బోల్తా 13 మందికి గాయాలు
పుట్టపర్తి ఆగస్టు 11 : బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి 44పై చుండూరు క్రాస్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదుపు తప్పి పుట్టపర్తి- బెంగళూరు బస్సు బోల్తా పడి 13 మంది ప్రయాణికులకు గాయాలు కాగా, వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. గుడిబండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు బెంగళూరు నుంచి పుట్టపర్తికి వెళుతున్న పుట్టపర్తి డిపో బస్సు గుడిబండ తాలూకాలోని చుండూరు క్రాస్ సమీపంలో బోల్తా పడిందని, బస్సులో సుమారు 30 మంది ప్రయాణిస్తుండగా, డ్రైవర్ తో సహా 13 మంది గాయపడ్డారని వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో చిక్కబళ్లాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. మిగిలిన వారు బాగేపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు . బస్సు అదుపుతప్పి పక్కన ఉన్న గుంతలోకి దూసుకుపోవడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ధృవీకరించారు. గుడిబండ పోలీసులు కేసు నమోదు చేరుకుని విచారణ చేపట్టారు. సంఘటన స్థలానికి పుట్టపర్తి ఆర్టీసీ డిపో అధికారులు చేరుకున్నారు. బస్సు బోల్తా పడిన వెంటనే స్థానిక ప్రజలు స్పందించి గాయపడిన డ్రైవర్ను,బస్సు ప్రయాణికులను కిందికి దించి అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రులకు తరలించారు.