
అంత రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత 13మంది అరెస్టు
21కేసులలో దొంగలించబడిన రూ.41.00.11.800 లక్షలు ప్రాపర్టీ,నగదు స్వాధీనం.
478.7గ్రాముల బంగారు ఆభరణాలు (రూ.33.007.800 విలువ)
కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్
కర్నూలు క్రైం , న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లాలోని 21కేసులలో దొంగలించిబడిన సొత్తును ఆదోని ఒకటవ పట్టణ పోలీసులు రికవరీ చేసి 13మందిని అరెస్టు చేశారని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ తెలిపారు.ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించారు.అక్టోబర్,5వ తేదిన ఆదోని సబ్ డివిజన్ లో ప్రాపర్టీ రికవరీ నేరాలపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.ఆ సందర్బంగా ప్రాపర్టీ రివకరీ బాగా చేస్తామని చెప్పడం జరిగిందని, చెప్పినట్లే బాగా చేశారన్నారు.గత 6నెలల నుండి ప్రాపర్టీ కేసులు జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో పెండింగ్ లో ఉన్నందున వాటిని త్వరితగతిన పరిష్కారంచేసి పలు కేసులలో పోయిన సొత్తును రికవరీ చేసి భాధితులకు న్యాయం చేయాలని ఆదేశించామన్నారు.రూ. 24లక్షల విలువ గల బైక్ లను ఇది వరకే రికవరీ చేశారన్నారు.నేడు రూ.41 లక్షల ప్రాపర్టీ రికవరీ చేయడంలో ఆదోని సబ్ డివిజన్ పోలీసులు బాగా పని చేశారన్నారు.ఆదోని డిఎస్పీ సోమన్న,ఆదోని ఒకటవ పట్టణ సిఐ శ్రీరామ్,ఎస్సై రామస్వామి,పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి బాగాపని చేశారన్నారన్నారు.స్పూర్తిగా తీసుకొని కర్నూలు జిల్లాలోని మిగతా సబ్ డివిజన్ ల పోలీసులందరూ ప్రాపర్టీ రికవరీలు,మిస్సింగ్ కేసులు,పెండింగ్ కేసులలో మంచి ప్రతిభను చూపాలన్నారు.ఆదోని టౌన్,కర్నూలు జిల్లా,నంద్యాల జిల్లా,నెల్లూరు జిల్లా,చుట్టుపక్కల జిల్లాలలో 10రోజుల నుంచి నిఘా ఉంచారన్నారు.అనంతరం ప్రాపర్టీ రికవరీలో బాగా పనిచేసిన ఆదోని ఒకటవ పట్టణ పోలీసులు ఎస్సై రామస్వామి,హెడ్ కానిస్టేబుల్స్ సత్తార్ వలి,హాజీ భాషా, కానిస్టేబుల్స్ రంగస్వామి,మునిస్వామి, నాగరాజు,మునిచంద్ర,ఏకవీర శేఖర్, హుస్సేన్ భాషా,మధుసుధన,అల్లెన్న, దామోదర్,రామచంద్ర,సుధీర్ కుమార్. హోంగార్డు సింధు,డ్రైవర్ బోజా,ముస్తాక్ భాషా లకు జిల్లా ఎస్పీ నగదు రివార్డులు, ఆదోని ఒకటవ పట్టణ సిఐ శ్రీరామ్ కి బహుమతి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆదోని డిఎస్పీ సోమన్న,ఆదోని ఒకటవ పట్టణ సిఐ శ్రీరామ్,సిఐలు ప్రసాద్, కేశవరెడ్డి,అబ్దుల్ గౌస్,మన్సూరుద్దీన్, శివశంకర్,ఆదోని ఒకటవ పట్టణ ఎస్సై రామస్వామి,సిబ్బంది పాల్గొన్నారు.
నిందితుల నేపథ్యం…
అంతర్జాతీయ దొంగల ముఠా దేశంలో అన్ని చోట్ల తిరుగుచూ ముఖ్యంగా,కర్నూలు జిల్లాలో పలు ప్రాంతాలలో దొంగతనాలు చేశారు.ఇవే కాకుండా రద్దీగా ఉండే తిరునాళ్లు,బహిరంగ సభలు జాతరలు, పాదయాత్రలు,దేవుని ఊరేగింపులు, ఉత్సవాలు,ఎక్కువ జనాభా గూమి గూడే ప్రదేశాలలో బ్యాగ్ లిఫ్టింగ్,పిక్ ప్యాకెటింగ్, అటెన్సన్ డైవర్షన్ దొంగతనాలకు పాల్పడతారన్నారు.కర్నూలు జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రం పలు ప్రాంతాలలో ముఖ్య నగరాలలో,దేశంలోని పలు రాష్ట్రాలలో,ముఖ్యనగరాలైనా అయోద్య,వారణాసి,కలకత్తా,గోవా,ముంబై, బెంగళూరు,హైదరాబాద్,హరిద్వార్, తిరుపతి,శ్రీశైలం పలు పెద్ద పెద్ద పుణ్య క్షేత్రాలకు వెళ్ళి దొంగతనాలకు పాల్పడుతున్నారు.గతంలో కూడా వీరిపై పలు కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు.వీరందరిని రిమాండుకు తరలించామన్నారు.పరారీలో ఉన్న ఇద్దర్నీ కూడా త్వరలో అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి,త్వరలో అరెస్టు చేస్తామన్నారు.అరెస్ట్ చేసిన వారిలో ఆంధ్రప్రదేశ్,నెల్లూరు జిల్లా,బోగోలే మండలం,అల్లిమడుగు సంఘం గ్రామానికి చెందిన సముద్రాల పృథ్వీరాజ్,సముద్రా ఏసుబాబు @ యేసోబు,సమురాళ్ళ జగదీష్,సముద్రాల డేవిడ్,నంద్యాల జిల్లా,ఆత్మకూరు,రెహమత్ నగర్,దండగల సరోజ,మాణిక్యాల విష్ణు,గుంజారాఘవ @ జోల్లోడుస్,రామలక్ష్మీ, బైరాపురం షేక్ దావూద్ భాషాలు ఉన్నారు.
పరారీలో ఉన్న ముద్దాయిలు :
నెల్లూరు జిల్లా,బింట్రగుంట,రమణమ్మ @ చిన్నపాప,ఆత్మకూరు మండలం,సిద్దాపురం గ్రామం,గిడ్డన్న@గిడ్డి,
జిల్లా దొంగలు :
కర్నూలు జిల్లా,ఎమ్మిగనూ టౌన్, బోయ ఆకుల వీరేష్,బోయవీరేష్,ఆదోనిటౌన్, క్రాంతినగర్,సయ్యద్ అహమ్మద్,కడప జిల్లా,వేముల మండలం,గొల్లగూడూరు గ్రామం,మాలవీరేష్,