
జాతీయ జెండాను ఎగురవేసిన కలెక్టర్ పమెల సత్పతి
తెలంగాణ : కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ పమెల సత్పతి హాజరయి జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమెల సత్పతి, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి మూడు రంగుల బెలూన్ లను గాలిలోకి వదిలారు.
Was this helpful?
Thanks for your feedback!