17 నుంచి పదో తరగతి పరీక్షలు

17 నుంచి పదో తరగతి పరీక్షలు

హోళగుంద, న్యూస్ వెలుగు: ఈ నెల 17 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఎంఈఓ -2 జగన్నాథ్ తెలిపారు.బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి 31వ తేది వరకు నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హోళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – ఏ సెంటర్, హోళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – బి సెంటర్,ప్రభుత్వ జూనియర్ కళాశాల, కేజిబివి పాఠశాలలను కేంద్రాలుగా ఎంపిక చేశామన్నారు.హోళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – ఏ సెంటర్ నందు 231,హోళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – బి సెంటర్ నందు 230,జూనియర్ కళాశాల నందు 200, కేజిబివి సెంటర్ నందు 128 విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు హాజరవుతారన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!