
25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి
తిరుపతి: బుదవారం జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. పలువురు రాష్ట్ర మంత్రులు తిరుపతిలోని ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రులు కూడా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల భౌతికకాయాలను స్వస్థలాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది.
కాగా, ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తొలి మూడు రోజుల పాటు టోకెన్ల జారీ ప్రక్రియను పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ఈ రోజుల్లో ఈ టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. అలాగే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లో ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ప్రతిరోజూ వైకుంట ద్వార దర్శనం టిక్కెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.