
26.25 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందచేసిన సెల్ కాన్ సీఎండీ
అమరావతి : వ్యాపారవేత్త, సెల్ కాన్ సీఎండీ గురుస్వామి నాయుడు తన జన్మదినం సందర్భంగా 100 అన్నక్యాంటీన్లలో భోజనానికి రూ.26.25 లక్షలను సీఎం చంద్రబాబుకి విరాళంగా అందజేసినట్లు తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా అన్నక్యాంటీన్లలో ఒక రోజు భోజనానికి అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చిన గురుస్వామి నాయుడుని సీఎం అభినందించారు. ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టాలన్న ఆశయాలకు మీలాంటి వల్ల సహకారం తప్పని సరి అని సీఎం చంద్రబాబు అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM