29 నుంచే  పీజీ పరీక్షలు…!

29 నుంచే పీజీ పరీక్షలు…!

గుంటురు న్యూస్ వెలుగు : నాగార్జున వర్సిటీ( ఏప్రిల్27): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించే పీజీ నాలుగవ సెమిస్టర్ పరీక్షలు యధావిధిగా ఈనెల 29 తేదీ నుండి జరుగుతాయని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాద్ స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ తేదీలలో ఎలాంటి మార్పు లేదనీ ఎట్టి పరిస్థితులలోనూ ఈనెల 29 నుంచే అనగా మంగళవారం నుంచే ఎ ఎన్ యు పీజీ 4 వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.29 వ తేదీన జరగబోతున్న పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధం కావాలని ఆయన సూచించారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాలలో విద్యార్థుల కు కావలసిన అన్ని సదుపాయాలను సమకూర్చామని తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులు అనువైన వాతావరణం లో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొ న్నారు. విద్యార్థినీ విద్యార్థులకు పరీక్షా కేంద్రాలలో ఎలాంటి అసౌకర్యం కలిగినా వెంటనే వర్సిటీ అధికారులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.
అయితే, ఇటీవల సామాజిక మాధ్యమాలలో, పలు సోషల్ మీడియా వేదికలపై “పరీక్షలు 10-06-2025 నుండి ప్రారంభమవుతాయి” అనే తప్పుడు ప్రకటన ప్రచారంలోకి వచ్చిందని, అలాంటి అసత్య సర్క్యులర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షల నిర్వహణపై తప్పుడు సమాచారం అందిస్తున్న వారిపై వర్సిటీ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!