
36వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు, ఆర్టీసీ కళాశాలలో డ్రైవర్లకు అవగాహన సదస్సు
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ స్టాప్ ట్రైనింగ్ కళాశాలలో 36వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 27వ రోజు కొనసాగుతున్నాయి. కార్యక్రమం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంత కుమారి
ఆదేశాల మేరకు ఆర్టీవో ఎల్ భరత్ చావన్ పర్యవేక్షణలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కే రవీంద్ర కుమార్, ఎన్ నాగరాజా నాయక్, ఎంవి సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాబు కిషోర్ ఆధ్వర్యంలో ఈ సదస్సు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టిసి కడప జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్, ఏపీఎస్ఆర్టీసీ కర్నూల్ డిపిటిఓ శ్రీనివాసులు, ఆర్టీసీ డిపో 1 మేనేజర్ సుధామణి, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ స్టాప్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ నజీర్ అహ్మద్, ట్రాఫిక్ సిఐ ఎస్ మన్సూరుద్దీన్, లు హాజరయ్యారు. ఆర్టీవో ఎల్ భరత్ చావన్ మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే రోడ్డు భద్రత మాసోత్సవాలో భాగంగా రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు సూచనలు తెలియజేశారు. ఆర్టీసీ డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి వాహనాలను నడిపి గమ్యం చేరాలని ఆయన డ్రైవర్లను కోరారు. కర్నూల్ ట్రాఫిక్ సిఐ మనసురుద్దీన్ మాట్లాడుతూ, డ్రైవర్లు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించి వాహనాలను నడపాలన్నారు, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం రాష్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని ఆయన తెలిపారు ముఖ్యంగా డ్రైవర్లు సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం ఎంతో ప్రమాదకరమనీ అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సంఘటన స్థలంలో ఉన్న ఎవరైనా సరే సహాయకుడు బాధ్యతగా అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కు తరలించాలన్నారు. రహదారి పైన ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద బాధితులను రక్షించడంలో మొదటి 60 నిమిషాలు ప్రమాద తీవ్రతను తగ్గించడానికి మరియు మరణాలు తగ్గించడానికి చాలా కీలకమైనవి ప్రాణాంతక రహదారి ప్రమాదాలలో క్షతగాత్రులను గోల్డెన్ అవర్ సమయంలో ఆస్పత్రి లేదా డ్రామా కేర్ సెంటర్ లకు తరలించి తగిన చికిత్సను అందించలనారు, ఈ సందర్భంగా కడప జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్న ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ కళాశాల లో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది, కర్నూల్ ఆర్టీవో, ట్రాఫిక్ సిఐ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అధికారులు అందరూ పాల్గొని ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రత మీద ఉత్తేజం కలిగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు వాడకం దారులందరూ ఎలాంటి చర్యలు తీసుకోవాలి దేనికి నియంత్రణ యంత్రాంగం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుందో ఇవన్నీ కూడా ఆర్టీవో వివరించడం జరిగింది, ట్రాఫిక్ సిఐ ప్రమాదాలు జరిగినప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా గాయపడిన ప్రాణాలు ఎలా నిలుపుకోవాలని దానిపైన చాలా వివర్నాత్మక సందేశం ఇచ్చారు. ఆర్టీసీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము అవన్నీ కూడా మేము ఆర్టీసీ అధికారులము వివరించడం జరిగింది, గతంలో మేం కూడా రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించే వాళ్ళం పక్షోత్సవాలు నిర్వహించే వాళ్ళం ఇప్పుడు ఒక నెలపాటు మాసోత్సవాలు నిర్వహించుకుంటున్నాం ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మా డ్రైవర్ల అందరికి కూడా ఈ రోడ్డు సేఫ్టీ డ్రైవింగ్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రమాదం చేయకుండా విధి నిర్వహణ లో రెండు, సంవత్సరం మూడో సంవత్సరం ప్రమాదరహిత రికార్డు నిర్వహిస్తే ఆ విధంగా వారికి అలవెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆరోగ్య పరీక్షలు అన్ని నిర్వహిస్తున్నాం 45 సంవత్సరాల లోపు ఉన్న డ్రైవర్లకు మూడు సంవత్సరాలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు 45 సంవత్సరాలు దాటిన వారికి ప్రతి సంవత్సరం ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇలాంటి పెండెన్సీ లేకుండా ఈ మాసోత్సవాల సందర్భంగా చూసుకుంటామని అన్నారు. ఈరోజు ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టుకున్న ప్రతి వ్యక్తి ఆరోగ్య భద్రత పరీక్షలు చేయబడి ఆరోగ్యవంతుడే ఉన్న డ్రైవరే ఆర్టీసీ స్టీరింగ్ మీద ఉన్నాడని ఆయన తెలిపారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆర్టీసీ డ్రైవర్ల చేతిలో సురక్షితమైన ప్రయాణం చేసుకోవచ్చని అన్నారు. మా వంతు కర్తవ్యం మా సిబ్బందిలో ఆరోగ్యకరమైన వాళ్లు రక్త దాన శిబిరాలు నిర్వహించి రక్తదానం చేస్తున్నారు. ఆ విధంగా ఇప్పటికే రెండు రోజులుగా రక్తదాన శిబిరాల్లో కార్పొరేషన్ పరంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మూడు వేల యూనిట్లకు పైగా రక్తదానం చేశారు. ఈరోజు రేపు కూడా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాము, దాదాపుగా మేము 48 వేల సిబ్బంది ఉంటే కనీసం 5,000 యూనిట్లకు పైగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ విధంగా 5000 మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళమవుతామన్నారు. బస్సులకు సంబంధించి ప్రమాదానికి కారణమయ్యే అంశాలకు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి, నిర్వహణ చేస్తున్నాము. ఈ మాసోత్సవాల సందర్భంగా ఆ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించబోతున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ డిపో 2 మేనేజర్ సర్దార్ హుస్సేన్, ఆర్టీసీ జోనల్ స్టాప్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ నజీర్ అహ్మద్, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ స్టాప్ ట్రైనింగ్ కళాశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుళ్లు విజయ భాస్కర్, చలపతి, హోంగార్డులు, ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.