59.70 కోట్లు మంజూరు.. సంతోషం వ్యక్తం చేసిన ఉపముఖ్యమంత్రి

59.70 కోట్లు మంజూరు.. సంతోషం వ్యక్తం చేసిన ఉపముఖ్యమంత్రి

అమరావతి న్యూస్ వెలుగు : పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి ₹59.70 కోట్లు మంజూరు కావడం , పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉందని జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.

ఎన్నికల సమయంలో నేను ఈ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చానన్నారు. సామర్లకోట-ఉప్పాడ రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారని ,  ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజలకు  రాకపోకలు సులభతరం అవుతాయన్నారు.  ఈ రహదారి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (CRIF) సేతు బంధన్ పథకంలో భాగంగా చేపట్టడమైనదని ఆయన తెలిపారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS