
59.70 కోట్లు మంజూరు.. సంతోషం వ్యక్తం చేసిన ఉపముఖ్యమంత్రి
అమరావతి న్యూస్ వెలుగు : పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి ₹59.70 కోట్లు మంజూరు కావడం , పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉందని జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
ఎన్నికల సమయంలో నేను ఈ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చానన్నారు. సామర్లకోట-ఉప్పాడ రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారని , ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయన్నారు. ఈ రహదారి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (CRIF) సేతు బంధన్ పథకంలో భాగంగా చేపట్టడమైనదని ఆయన తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!