76 సెంటర్లలో ఇంటర్మీడియట్ పరీక్షలు

76 సెంటర్లలో ఇంటర్మీడియట్ పరీక్షలు

జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

76 సెంటర్లలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు.

జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య.

కర్నూలు న్యూస్ వెలుగు : మే12 వ తేది నుండి 20వ తేది వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలను76 సెంటర్లలో పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య సంబధిత అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ముందస్తు ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే12 వ తేది నుండి 20 వ తేది వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలను76 సెంటర్లలో పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.మొదటి సంవత్సరం నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు 15501 మంది జనరల్ విద్యార్థులు, 791 మంది ఒకేషనల్ కోర్సు కు సంబంధించిన విద్యార్థులు మొత్తం 16292 మంది విద్యార్థులు 52 సెంటర్లలో పరీక్షలు వ్రాస్తున్నారని,2 వ సంవత్సరానికి సంబంధించి 4437 మంది జనరల్ విద్యార్థులు, 595 మంది ఒకేషనల్ కోర్సు కు సంబంధించిన విద్యార్థులు మొత్తం రెండో సంవత్సరానికి 5032 అంది విద్యార్థులు 24 సెంటర్లలో పరీక్షలు వ్రాస్తున్నారన్నారు, ఈ పరీక్షల నిర్వహణకు ఆయా శాఖల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.. ప్రశ్న పత్రాలను ఆయా పరిధిలోని పోలీస్ స్టేషన్లో భద్రపరచడం జరిగిందని, ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాల వద్దకు ఎస్కార్ట్ తో తీసుకొని వెళ్లాలని, ఉదయం పరీక్షల నిర్వహణ అనంతరం ఎస్కార్ట్ తో పోస్ట్ ఆఫీస్ వద్దకు తీసుకొని వెళ్లి పోస్టల్ ద్వారా పంపించవలసి ఉంటుందన్నారు, సాయంకాలం నిర్వహించిన పరీక్ష పత్రాలను పోలీస్ స్టేషన్ల నందు భద్రపరిచి మరుసటి దినము ఆ పరీక్ష పత్రాలను పోస్ట్ ఆఫీస్ కు ఎస్కార్ట్ తో తీసుకువెళ్లాలని, పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారుల ను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిష కేంద్రాల వద్ద త్రాగునీటి సదుపాయం కల్పించాలని, పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూడాలని జాయింట్ కలెక్టర్ మున్సిపాలిటీ వారిని ఆదేశించారు. జిల్లా పంచాయతీ వారు. రూరల్ ప్రాంతంలో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు త్రాగునీటి సదుపాయం కల్పించాలని, పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలను శుభ్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డిపిఓ కార్యాలయం సిబ్బందిని ఆదేశించారు. విద్యాశాఖ వారు పరీక్షల సమయంలో ఆర్ఐఓ సమన్వయంతో ఇన్విజిలేటర్స్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
రెవిన్యూ డిపార్ట్మెంట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలయ్యేలా చూడాలని, పరీక్ష కేంద్రాల నిర్వహణలో ప్లేయింగ్ స్క్వాడ్ నందు ఇద్దరు రెవిన్యూ అధికారులు ఉండేలా చూడాలని అన్నారు.
లేబర్ డిపార్ట్మెంట్ వారు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్ లను క్లోజ్ చేయించాలన్నారు.
ఏపీఎస్ఆర్టీసీ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తగినన్ని బస్సులు ఆ రూట్లో తిరిగేలా చూడాలన్నారు.వైద్య ఆరోగ్యశాఖ వారు పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్ ఎస్ ఎస్ ప్యాకెట్లు,ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచుకొని ఆశా వర్కర్లను కూడా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ పరీక్ష కేంద్రాల నుండి వచ్చినటువంటి పత్రాలను జాగ్రత్తగా పోస్ట్ చేసేలా చూడాలన్నారు.
ఏపీ ఎస్పీడీసీఎల్ పరీక్ష కేంద్రాల లో విద్యుత్ అంతరాయం కలవకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
డివిఈవో వారు ఆర్ఐవో వారి సమన్వయంతో పరీక్షలు విజయవంతంగా నిర్వహించుకునేలా చూడాలన్నారు.సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో విధులు నిర్వహించి పరీక్షలను పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ఓ గురువయ్య శెట్టి, డివిఈఓ సురేష్ బాబు, జడ్పీ సీఈవో నాసరా రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి శాంతి కల, ఏపీ ఎస్పీడీసీఎల్, లేబర్ డిపార్ట్మెంట్, ఏపీఎస్ఆర్టీసీ, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS