కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు 

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు 

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన డాక్టర్లకు  వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎందరో అమరవీరులను  వారి త్యాగాలను కృతజ్ఞతగా స్మరించుకున్నారు. ఆసుపత్రిలోని వైద్య అధ్యాపకులు డా.డి.చక్రవర్తి (జనరల్ సర్జరీ), డా.టి.కుమూడా (అసోసియేట్ ప్రొఫెసర్, గైనిక్), డా.పుండరీకాక్షయ్య (అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యూరో సర్జరీ), ఆసుపత్రి ఏడి, శ్రీ రమేష్ బాబు,  ఇతర సిబ్బందికి ప్రశంసా పత్రాలతో బహూకరించినట్లు తెలిపారు. ఆస్పత్రిలో జరిగిన వివిధ అభివృద్ధి పనులు
ఆసుపత్రి పలు విభాగానికి డెవలప్మెంట్ చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఓపి 333 వెల్నెస్ క్లినిక్ ను ప్రారంభించడం జరిగిందని అన్నారు.ఆసుపత్రిలోని ఈ డిజిటల్ ఓపి మరియు ఐపి సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఆసుపత్రిలో త్వరలో పెయిన్ బ్లాక్ రూమ్స్ అందుబాటులోకి వస్తాయని..ఆసుపత్రిలో అత్యాధునిక యంత్రాలతో సిటీ స్కానింగ్, ఎమ్మారై MRI , కేథలబ్ మిషిన్, న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ నుండి పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు .
ఆసుపత్రిలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ విభాగానికి అధునాతనమైన యంత్రాలతో త్వరలో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయని
ఆసుపత్రిలో వైద్యులు మరియు వైద్య సిబ్బంది అందరూ సేవలు మెరుగుపరచాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.శ్రీరాములు, CSRMO, డా.వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటర్, సింధు సుబ్రహ్మణ్యం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, ఆసుపత్రి ఏడి, రమేష్ బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్, సావిత్రిబాయి,  డాక్టర్లు,  వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!