హుసేనాపురం నందు 85 లక్షల తో అభివృద్ధి పనులు

హుసేనాపురం నందు 85 లక్షల తో అభివృద్ధి పనులు

 25 లక్షలతో కల్వర్టులు ఏర్పాటు

 60 లక్షల తో సిమెంట్ రోడ్లు

 అభివృద్ధి పనులను పరిశీలించిన సర్పంచ్ సలహాదారుడు సుల్తాన్.

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల పరిధిలోని గల హుసేనాపురం గ్రామంలో 85 లక్షల నిధులతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని సర్పంచ్ గౌరవ సలహాదారులు సుల్తాన్ తెలియజేశారు. శుక్రవారం రోజున ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ప్యాపిలి – పగిడిరాయి ప్రధాన రహదారి నుండి హుసేనాపురం గ్రామంలోకి రహదారి నిర్మించేందుకు నిధులు మంజూరు కావడం జరిగింది. అయితే పనులు ప్రారంభం కాకమునుపే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది.దీంతో వైసిపి ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ పనులు జరగలేదు. ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం అధికారం లోకి రావడంతో ప్యాపిలి-పగిడిరాయి మెయిన్ రోడ్డు నుండి హుస్సేనాపురం లోకి సిమెంట్ రోడ్డు నిర్మించేందుకు స్థానిక శాసనసభ్యులు కెఈ శ్యాం కుమార్ 85 లక్షలు నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు.దీంతో సంబంధిత కాంట్రాక్టర్ నిర్మాణ పనులను ప్రారంభించారు.25 లక్షలతో కల్వర్టర్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. అలాగే 60 లక్షల నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు కూడా చేపట్టేందుకు జెసిపి తో మట్టి పనులు చేయించడం ప్రారంభించారు.తమ గ్రామానికి సిమెంట్ రోడ్డు,కల్వర్టు నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం ప్రకటిస్తున్నామన్నారు.ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు కెఈ శ్యామ్ కుమార్ కు గ్రామం తరపున తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.పనులను నాణ్యతతో చేయించే విధంగా చూస్తామని సర్పంచ్ గౌరవ సలహాదారులు సుల్తాన్ తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!