జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర -స్వచ్ఛత దివస్

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర -స్వచ్ఛత దివస్

కర్నూలు, న్యూస్ వెలుగు; వైద్య  ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం కర్నూలు నందు జిల్లా వైద్య  ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ P. శాంతికళ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్చత దివస్ కార్యక్రమం లో భాగంగా కార్యాలయ పరిసరాలను పరిశుభ్రం – చేయించడం జరిగినది. సందందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వచ్చ భారత్ మిషన్ లో బాగంగా ప్రతి నెలా మూడవ శనివారాన్ని “స్వచ్చత దివస్” గా పరిగణిస్తూ జిల్లా వైద్య  ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు మరియు హెల్త్ అండ్ వేల్నేన్స్ సెంటర్స్ నందు ఈ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తదుపరి స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్చ దివస్ ప్రతిజ్ఞ – చేయించారు.
ఈ కార్యక్రమంలో DIO డాక్టర్ నాగప్రసాద్ కార్యాలయ పరిపాలన అధికారి అరుణ, RBSK PO శైలేష్ కుమార్, డెమో శ్రీనివాసులు, SO హేమసుందరం, DPHNO అన్నపూర్ణమ్మ, డిప్యూటీ డెమో చంద్రసేకర్ రెడ్డి, AMO చంద్రసేకర్, డిస్ట్రిక్ట్ ఎపిడమాలజిస్ట్ వేణుగోపాల్, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పద్మావతి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా వైద్య మరియు ఆరోగ్య-శాఖాధికారి కర్నూలు

Author

Was this helpful?

Thanks for your feedback!