
కలెక్టర్ కు సూచనలు చేసిన ముఖ్యమంత్రి
Puttaparthi (పుట్టపర్తి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతిలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ వీ రత్నతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
సచివాలయం 5వ భవనంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ తో శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వి. రత్న సమావేశం కావడం విశేషం, ఈ సందర్భంగా నూతన జిల్లా అయిన సత్య సాయి జిల్లాలో అభివృద్ది శాంతి భద్రతలపై మాట్లాడినట్లు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu