
ప్లాస్టిక్ వాడకం తగ్గించుకుందాం :కూర్మనాథ్
అమరావతి న్యూస్ వెలుగు : “అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ – ప్రమోట్ రీయూజబుల్స్” థీమ్ లో భాగంగా “ప్లాస్టిక్ వాడకం తగ్గించు – ప్రకృతిని పరిరక్షించు’ నినాదంతో APSDMA (ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ) ఎండి పరిధిలోని పర్యావరణానికి అత్యంత హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులు మరీ ముఖ్యంగా ఒకసారి వినియోగించి వదిలేసే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్,కవర్లు, వస్తువులను ఎండి రోణంకి కూర్మనాథ్ తొలగించారు.వాటి స్థానంలో పర్యావరణ హితమైన విధానంలో గ్లాస్లు,కప్పులు,ప్లేట్లు,జ్యూట్,క్లాత్ క్యారీ బ్యాగులు వంటివి వినియోగించాలని సిబ్బందికి సూచించారు.
Was this helpful?
Thanks for your feedback!