
ఆ మహానుభావుని స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణం : మంత్రి సత్యకుమార్
శ్రీ సత్యసాయి జిల్లా : ధర్మవరంలోని కాలేజీ సర్కిల్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుని సేవల్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఆయన పట్టుదల, దృఢ చిత్తం, సంకల్పం ఎప్పటికీ ఆదర్శనీయం, ఆచరణీయమన్నారు. ఆ మహానుభావుని స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణానికి, సమున్నత ప్రగతికి అంకితమవుదామని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!