
సీపీఐ శాఖ సమావేశంలో పాల్గొన్న రంగనాయుడు
పాములపాడు న్యూస్ వెలుగు : పాములపాడు మండలం లోని బాణాకచర్ల లో సీపీఐ శాఖ సమావేశం నిర్వహించినట్లు శాఖ కార్యదర్శి యేసేపు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగ నాయుడు ముఖ్యఅథిదిగా పాల్గొని శాఖలోని ప్రతి సభ్యుని సమస్యలతోపాటు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎం రమేష్ బాబు, ఆత్మకూరు కార్యదర్శి ప్రతాప్, కొత్తపల్లి మండలం కార్యదర్శి వెంకటశివుడు, పాములపాడు కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!