
రోడ్డు నిర్మాణ పనులు చేపట్టండి:ఎంపీ నాగరాజు
కర్నూలు:కర్నూలు నగరంలో నుండి ఉల్చాల మీదుగా రేమట గ్రామానికి రహదారి పెండింగ్ పనులను పూర్తి చేయాలని కర్నూలు యంపీ బస్తిపాటి నాగరాజును రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ కలిసి విన్నవించారు., స్పందించిన యంపీ ఆర్ అండ్ బీ ఎస్ఈ నాగరాజుతో చరవాణి ద్వారా సంప్రదించారు యంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ గతంలో పూర్తిచేయాల్సిన రహదారి పెండింగ్ ఎందుకు ఉందని అడిగి తెలుసుకుని రేమట రోడ్డు నిర్మాణ పనులకు ప్రభూత్వం ద్వారా చేయించాల్సిన పనులను తాను చేయించడానికి సిద్దంగా ఉన్నానని ఏదైనా సమస్యవుంటే తమను సంప్రదించి పెండింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ ఎస్ఈ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అశోక్,సురేష్,వసంత్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.