అథ్లెట్ దీప్తి ని సత్కరించిన ముఖ్యమంత్రి 

అథ్లెట్ దీప్తి ని సత్కరించిన ముఖ్యమంత్రి 

తెలంగాణ: ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పారాలింపిక్స్ 2024లో పతకం సాధించిన తెలంగాణ

యువ అథ్లెట్ జీవాంజి దీప్తి ని ముఖ్యమంత్రి  సత్కరించారు. విశ్వ వేదికపై సత్తా చాటిన పారా అథ్లెట్ దీప్తి గారికి గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, 1 కోటి రూపాయల నగదు బహుమానం, వరం‌గల్‌లో 500 గజాల స్థలం, కోచ్ నాగపురి రమేష్ కి రూ. 10 లక్షలు బహుమతిగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇటీవల పారిస్ వేదికగా జరిగిన  పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో జీవాంజి దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. పారా అథ్లెట్స్, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేలా, వారికి అవసరమైన ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరామ్  ఎమ్మెల్యే నాగరాజు  తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్) చైర్మన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS