
పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; ఎస్పీ ఆదేశాల మేరకు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన జమ్మలమడుగు సబ్ డివిజన్ ఇంచార్జ్ డిఎస్పి రమాకాంత్ రక్తదాన శిబిరం నందు జమ్మలమడుగు అర్బన్ సీఐ లింగప్ప , జమ్మలమడుగు రూరల్ సిఐ గోపాల్ రెడ్డి, కొండాపురం సిఐ రఫీ గారు, కలమల ఎస్ఐ తిమోతి , మెడికల్ ఆఫీసర్ శ్రీలత ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు టౌన్ కు చెందిన ప్రజలు రాజకీయ నాయకులు సిబ్బంది రక్తదానం చేసినారు. ఇప్పటివరకు 50 మంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది.
Was this helpful?
Thanks for your feedback!
			

 Ponnathota Jayachandra
 Ponnathota Jayachandra