
వైభవంగా నంది ఉత్సవం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో స్థానిక కొండ గుహలో స్వయంభువుగా వెలసిన శ్రీ సిద్దేశ్వర స్వామీ నంది ఉత్సవం బుధవారం రమణీయంగా జరిగింది.అలాగే ఉదయం నుంచి స్వామి వారి సన్నిధిలో ఆలయ ధర్మకర్త హెచ్.రాజపంపన్న గౌడ,భారత్ యూత్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శివశంకర్ గౌడ సిద్ధార్థ గౌడ ఆధ్వర్యంలో అభిషేకం,కుంకుమార్చన, ఆకుపూజ,పెద్ద ఎత్తున పూల మాలలతో స్వామి వారిని అలంకరించారు.సాయంత్రం 6:30 నిమిషాలకు నంది ఉత్సవం సందర్భంగా తేరు బజారు ప్రాంగణం చిన్నారుల శ్రీ సిద్దేశ్వర స్వామి జై అనుకుంటూ ముందుకు సాగింది ఉచ్చయ జయ జయ ధ్వనులతో మారుమోగింది.ప్రధానంగా ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.అదేవిధంగా నేడు గజోత్సవం ఉన్నట్లు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!