
వైవీయులో లా డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలి: డివైఎఫ్ఐ
కడప సర్కిల్, న్యూస్ వెలుగు; యోగివేమన విశ్వ విద్యాలయం లో లా డిపార్టుమెంటు ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా వీరణాల.శివకుమార్ ప్రకటనలో తెలిపారు. కడపలో ఆయన మాట్లాడుతూ యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న న్యాయవిద్యా కళాశాలలో ప్రతి సంవత్సరం రెండింటిలోనూ మూడు సంవత్సరాలు ఎల్ .ఎల్. బి మరియు ఐదు సంవత్సరాల బి. ఏ, ఎల్.ఎల్.బి లో దాదాపు 4వేల మందికి పైగా విద్యార్థులు న్యాయవిద్య అభ్యసిస్తున్నారన్నారు. సెమిస్టరు విధానంలో న్యాయవిద్యను అందిస్తూ ఉండడంతో అకడమిక్ క్యాలెండరు అందించడంలో ఎగ్జామ్స్, సెమిస్టరు పరీక్షలు నిర్వహించడంలో యూనివర్సిటీ తాత్కా లిక ఇన్చార్జిలకు పెనుభారం అవుతుందన్నారు. దీనివల్ల న్యాయవిద్య అభ్యాసం చేసే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.దాదాపు 16 సంవత్సరాల అవుతున్న కడప జిల్లాలో విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య కంటూ ప్రత్యేకంగా ఒక విభాగం లేదనే విషయం చాలా బాధాకరమైనది. ఇదేదో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉందని పేర్కొన్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయవిద్య నిర్వహణ, కళాశాలల పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక లా డిపార్ట్మెంటు ఏర్పాటు చేసి చేసి నిర్దిష్ట అకడమిక్ క్యాలెండరు ద్వారా సెమిస్టరు పరీక్షలు నిర్వహించి అకడమిక్ సంవత్సరాలు సకాలంలో పూర్తి చేసేలా న్యాయవిద్య అందించాలని కోరారు. యూనివర్శిటీ పరిధిలో లా కళాశాల ఏర్పాటు చేసి ఎమ్మెల్ కోర్సులు అందించాలని కోరారు. కడప జిల్లా నుంచి న్యాయవిద్యలో పీజీ చేయాలంటే పొరుగు రాష్ట్రాకు వెళ్లవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.