ఢిల్లీ : ఇండియాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఆదివారం భారతదేశంలో నోటి ఆరోగ్య సంరక్షణ పై వర్క్షాప్ను నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.

దేశంలో ఓరల్ హెల్త్కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరచడంపై ఈ కార్యక్రమం కేంద్రీకృతమై ఉందని . ఈ సందర్భంగా కీలకోపన్యాసం చేస్తూ నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ కుమార్ పాల్ జాతీయ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్ 2.0ని రూపొందించాలని పిలుపునిచ్చారు. పలు రంగాల్లో నోటి ఆరోగ్యం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. నోటి ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుర్వేద పద్ధతులను ఉపయోగించుకోవడం మరియు పిల్లల నోటి ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించడం గురించి కూడా ఆయన మాట్లాడారు.
Thanks for your feedback!