
ముంబైలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులతో సమావేశమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
సమావేశంలో ఎం.పి బస్తిపాటి నాగరాజు
కర్నూలు, న్యూస్ వెలుగు; వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ పై మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెండవ రోజు అధ్యయన పర్యటన నిర్వహించింది..ఈ పర్యటన లో స్టాండింగ్ కమిటీ సభ్యుడైన కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు.. పర్యటనలో భాగంగా కమిటీ చైర్మన్ కనిమొళి కరుణానిధి తో కలిసి సభ్యులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ కార్యాలయాన్ని సందర్శించి బీ.ఐ.ఎస్ గార్డెన్ ను ప్రారంభించారు.. అనంతరం అక్కడి అధికారులతో సమావేశమై వస్తువుల ప్రామాణీకరణ, మార్కింగ్ మరియు నాణ్యత ధృవీకరణ కార్యకలాపాల పై చర్చించారు..
Was this helpful?
Thanks for your feedback!