
ప్రభుత్వ కార్యాలయాలలో బసవేశ్వరుని ఫోటోను ఏర్పాటు చేయాలి
* తెలుగుదేశం పార్టీ వీరశైవ లింగాయత్ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు బాడదా కౌశిక్ కుమార్
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల యందు బసవేశ్వరుని ఫోటోలను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ వీరశైవ లింగాయత్ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు బాడదా కౌశిక్ కుమార్ తెలియజేశారు.శనివారం రోజున విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 12వ శతాబ్దపు కవి, తత్వవేత్త మరియు లింగాయత్ సాంప్రదాయాన్ని స్థాపించిన బసవేశ్వరునికి తగిన గుర్తింపునిచ్చి ప్రభుత్వ కార్యాలయాలలో ఫోటోలను ఏర్పాటు చేయాలని ఆయన తెలియజేశారు.అదేవిధంగా ప్రతి మండల కూడలియందు బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన తెలియజేశారు.ప్రతి ఏటా కర్ణాటక రాష్ట్రం నందు బసవ జయంతికు సెలవు దినంగా ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బసవ జయంతి వేడుకలను నిర్వహిస్తుందని ఆయన తెలియజేశారు.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, మరియు మహారాష్ట్ర రాష్ట్రాలలో కూడా బసవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారని ఆయన తెలియజేశారు. కావున కుల,వర్ణ మరియు లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన పోరాటయోధుడు “విశ్వగురు” బసవేశ్వరుని ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల నందు మరియు మండల కేంద్రమైన ప్రధాన కూడళ్ళ యందు బసవేశ్వరుని ప్రతిమను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ వీరశైవ లింగాయత్ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు బాడదా కౌశిక్ కుమార్ తెలియజేశారు.