
సిసి రోడ్లు నిర్మాణం చేపట్టాలని సబ్ కలెక్టర్ కు వినతి
దాదాపు 30 సంవత్సరాల తరువాత గ్రామానికి కలెక్టర్ రాక…
హొళగుంద, న్యూస్ వెలుగు: మండలంలోని ఇంగలదహల్ గ్రామానికి వచ్చిన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు ఆ కాలనీ యువకులు వినతిపత్రం అందజేశారు. యువకులు సబ్ కలెక్టర్ బిసి కాలనిలో వర్షం నీరే కాదు వాడుకున్న డ్రైనేజి నీరు వెళ్ళడానికి కూడా లేకుండా అన్ని రోడ్ల పైనే నీరు అగుతుంది అని.సిసి రోడ్లు కూడా లేక పోవడం వల్ల నడవటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు.అలాగే ప్రధాన రహదారి నుండి కలనిలోకి కూడా సిసి రోడ్లు లేక వర్షాలు వస్తే కాలనీల్లోకి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు వెళ్లే పిల్లలు అందులో పడిపోతున్నారు.అని అధికారులకు చెప్పినా కూడా చూసి చూడనట్టు వుంటున్నారు అని కావున ఈ సమస్యలు పరిష్కరించాలని కోరారు. సబ్ కలెక్టర్ గారు స్పందించి 15రోజులలో ఈ సమస్యలు పరిష్కారం చేసేవిదంగా చూస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిసి కాలనీ యువకులు పి.రాజు,మల్లికార్జున, పంపాపతి, రాజు పాల్గొన్నారు.