
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ లకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలి
కర్నూలు కార్పొరేషన్, న్యూస్ వెలుగు; కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణల బిల్లు 2024ను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేయాలని ఆవాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఎస్ .ఏ. సుభాన్, ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ముస్తఫా ,రాష్ట్ర కమిటీ సభ్యులు పి. ఇక్బాల్ హుస్సేన్, ఎస్. ఎం .డి. షరీఫ్ లు ఎ పి కూటమి ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. బుధవారం ఆవాజ్ కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం నగర కమిటీ కార్యాలయంలో జరిగింది. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఎస్. ఏ. సుభాన్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి. ఇక్బాల్ హుస్సేన్ ,ఎస్. ఎం డి. షరీఫ్ హాజరై ప్రసంగించారు .ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై వారు ప్రసంగించారు ఏపీ అసెంబ్లీ నిర్వహిస్తున్న సందర్భంగా ముస్లింలపై ఉన్న చిత్త శుద్ధి ని నిరూపించుకోవాలంటే తక్షణమే ఏపీ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలియజేశారు. ఈ బిల్లు గనుక పాస్ అయితే ముసల్మాన్లకు సంబంధించిన మద్రసలు , ఖబ్రస్తాన్ లు మసీద్ లుగాని ఇవి ఏమి మిగలకుండా చేయాలని చెప్పేసి బిజెపి ప్రభుత్వం యొక్క సంకల్పం అని దీని వెనక ఆర్ఎస్ఎస్ కుట్ర దాగి ఉందని వారు వివరించారు .లౌకిక సూత్రాలను ఉల్లంఘించడమే కాకుండావక్ఫ్ బోర్డు నామి నెటెడ్ సభ్యులు చైర్మన్ లను నియమించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలకు ముప్పు కలిగిస్తుందని వారు వివరించారు. తక్షణమే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం బోర్డు సవరణలను వ్యతిరేకిస్తూ
ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలోహఫీజ్ హనీఫ్, మొహమ్మద్, ఇబ్రహీం, మహబూబ్ బాషా, రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.