
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో అద్వితీయమైన బ్రాండెడ్ అభరాణాల ప్రదర్శన
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు లోని మాలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షో రూంలో అద్వితీయమైన బ్రాండెడ్ అభరాణాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈప్రదర్శనను మాలబార్ గోల్డ్ కష్టమర్ల చేత నిర్వహకులు ప్రారంభించారు. ఈప్రదర్శన డిశంబర్ 14నుంచి 21 వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా తయారు చేసిన అన్ని విభాగాలకు చెందిన బంగారు ఆభరణాలను ప్రదర్శనలో ఉంచామని దీనిని మాలబార్ గోల్డ్ కష్టమర్లు వినియోగించుకోవాలని వారు కోరారు. మేకింగ్ చార్జీల పై డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. ఈరోజు నుంచి మాలబార్ షోరూంలో యండీఎఫ్. ఫెస్టివల్ ప్రారంభం అయ్యిందన్నారు. నేటి నుంచి జనవరి 12 వరకు ఈ ఫెస్టివల్ కొనసాగుతుందని వారు తెలిపారు. డైమండ్స్ లో కొత్త మోడల్స్ వచ్చాయని వాటిని కష్టమర్లు వినియోగించుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో అజీస్, ఫైయాజ్, మయిజ్, మన్సూర్, నూరుల్లా, ఫర్హాన్, సుదాకర్, తదితరులు పాల్గొన్నారు.