బదిలీ అయిన మహిళ పోలీసుకు సన్మానం

బదిలీ అయిన మహిళ పోలీసుకు సన్మానం

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో ఎల్లార్తి గ్రామ సచివాలయంలో మహిళ పోలీసుగా విధులు నిర్వహిస్తున్న ధనలక్ష్మీ నంద్యాల జిల్లా అంబాపురం గ్రామ సచివాలయంకు బదిలీ కావడంతో మంగళవారం గ్రామ సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో యువనేత గిరి,ప్రధానోపాధ్యాయురాలు విజయమ్మ మహిళ పోలీస్ ధన లక్ష్మిని ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీ అనేది సర్వ సాధారణమని,ఎక్కడ పనిచేసిన ప్రజలకు మేలు చేసి ప్రజల నుంచి మన్నలు పొందాలి విధి నిర్వహణకు మించిన దేశ సేవ ఏది లేదన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు వెంకటేష్,సచివాలయం సిబ్బంది కుషా నాయక్,శివ,శీను, ఎంఎల్ హెచ్ పి నీరజ,ఇందిరమ్మ,లేపాక్షి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!