
అగ్రగామిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం: ఆచార్య బ్రహ్మాజీ
న్యూస్ వెలుగు గుంటూరు :
విద్యార్థుల అభిరుచులకు ఆకాంక్షలకు అనుగుణంగా ఎ ఎన్ యు లో ప్రవేశాలకు అవకాశం”
ప్రైవేటు వర్సిటీలకు సైతం ఆదర్శం గా ఎ ఎన్ యు నిలుస్తోంది
సమాజంలోని అన్ని వర్గాలకూ విద్య అందేలా వర్సిటీ చర్యలు చేపడుతోంది
ప్రతీ పేద మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని కోర్సుల ఫీజులు
సమాజ అవసరాలకు తగినట్లుగా వర్సిటీలో పలు వినూత్న కోర్సులు
అన్నింటా అగ్రగామిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
మౌళిక సదుపాయాల కల్పనలో వర్సిటీ ముందంజ
విద్య ఉపాధి అవకాశాలలో సముచిత స్థానం
విలువలతో కూడిన విద్య, ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన
విద్యార్థినీ విద్యార్థులు వర్సిటీని వినియోగించుకోవాలి
― ఆచార్య పి బ్రహ్మాజీ,వర్సిటీ ప్రవేశాల విభాగం సంచాలకులు
నాగార్జున వర్సిటీ : విద్యార్థుల అభిరుచులకు ఆకాంక్షలకు అనుగుణంగా ఎ ఎన్ యు లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నామని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రవేశాల విభాగం సంచాలకులు ఆచార్య పి బ్రహ్మాజీ ప్రకటించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థులకు విద్యను అందించడం, మహోన్నత విద్యా ప్రమాణాలతో విద్యా బోధన అందించడంలో ప్రైవేటు వర్సిటీలకు సైతం ఆదర్శం గా నిలిస్తోందని ఆయన పేర్కొన్నారు.
నేటి వర్తమాన కాలంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థులకు విశిష్టమైన సేవలను అందిస్తూ అన్నింటా అగ్రగామిగా నిలుస్తోందని విశదీకరించారు . సోమవారం గుంటూరు లోని “గుంటూరు ప్రభుత్వ వో మెన్స్ కళాశాల” లో ఎ ఎన్ యు లోని పీజీ కోర్సుల పై అవగాహన సదస్సును ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌళిక సదుపాయాలలో వర్సిటీ ముందంజలో ఉందని విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయని పేర్కొన్నారు.విద్య ఉపాధి అవకాశాలలో సముచిత స్థానం లో వర్సిటీ ఉందని ఆయన తెలిపారు.ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో అధ్యాపకులు విలువలతో కూడిన విద్య, ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నారని వర్సిటీ అందిస్తున్న కోర్సులను ,విద్యా అవకాశాలను విద్యార్థినీ విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రతీ పేద ,మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని కోర్సుల ఫీజులు ఉన్నాయని ఆయన విద్యార్థులకు తెలిపారు.
సమాజ అవసరాలకు తగినట్లుగా వర్సిటీలో పలు వినూత్న కోర్సులను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.విద్యార్థుల ఆసక్తి మేరకు పలు డిప్లమో కోర్సులను,సర్టిఫికెట్ కోర్సులను విశ్వవిద్యాలయం అందిస్తోందని ఆయన వివరించారు. విద్యార్థులకు మంచి సదుపాయాలు,ఆరోగ్యకర రీతిలో కూడిన వసతి గృహాలు,వ్యాయామ శాలలు, పుస్తక పఠన శాలలు ఆహ్లాదకర రీతిలో ఉన్నాయని క్షుణ్ణంగా విశదీకరించారు.డిగ్రీ అనంతరం విద్యార్థినులు వర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న ఆచార్య తులసీదాసు వర్సిటీ ప్రగతిని సోదాహరణం గా వివరించారు. ఆచార్య తులసీదాసు మాట్లాడుతూ వర్సిటీలో విద్యార్థుల భవిష్యత్తుకు తీసుకుంటున్న ప్రాణాళికలను వివరించారు.ఈ ఆ అవగహనా సదస్సులో గుంటూరు ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.