వినోదాన్ని వ్యాపారంగా మారుస్తున్న సినిమా థియేటర్ల పై చర్యలు తీసుకోవాలి

వినోదాన్ని వ్యాపారంగా మారుస్తున్న సినిమా థియేటర్ల పై చర్యలు తీసుకోవాలి

 పుష్ప-2 టికెట్ల ధరలను తగ్గించాలి ; డివైఎఫ్ఐ

న్యూస్ వెలుగు, కర్నూలు; వినోదాన్ని సామాన్య ప్రజానీకానికి అందుబాటులో లేకుండా భారీ వ్యాపారంగా మారుస్తున్న సినిమా థియేటర్ల పైన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ డిమాండ్ చేశారు. కర్నూల్ నగరంలో పుష్ప-2 సినిమా చూడాలని ఎదురుచూసిన ప్రేక్షకులకు అనుభూతి పొందటానికి టికెట్ రేట్ 900 మరియు 922 ఉండటము తో పేద సామాన్యమైన ఫాన్స్ సినిమా టికెట్లు కొనుక్కోలేక ఇంటికి వెనుతిరిగి పోతున్నారని తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని భారీగా టికెట్ల రేట్లు పెంచిన సినిమా థియేటర్ల పైన, నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేయడం, తినుబండారల రేట్లు పెంచడం కనీసం మంచినీళ్లు కూడా ప్రేక్షకులతో పాటు థియేటర్లోకి అనుమతించనీ థియేటర్ల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదవారు మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు 900 టికెట్ పెట్టి సినిమా చూడగలరా ప్రశ్నించారు. ప్రస్తుత బిజీ లైఫ్ లో వినోదం అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది అలాంటిది భారీగా రేట్లు పెంచడంతో ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. రేట్లు తగ్గియకుంటే యువతి యువకులందరూ ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు అబ్దుల్లా, కర్నూలు మండల కార్యదర్శి ప్రకాష్, న్యూ సిటీ ఉపాధ్యక్షులు విజయ్, సాయి ఉదయ్ పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!