
విద్యార్థినీ విచక్షణారహితంగా కొట్టిన చైతన్య పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి
హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్ సెల్ కర్నూలు చైర్మన్ అయ్యన్న డిమాండ్
కర్నూలు, న్యూస్ వెలుగు; ఎల్కేజీ చదువుతున్న విద్యార్థిని డోల వైష్ణవి పై విచక్షణారహితంగా కొట్టిన చైతన్య పాఠశాల సిబ్బంది , యాజమాన్య పై చర్యలు తీసుకోవాలి
కర్నూలు నగరంలోని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం నందు హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషనల్ సెల్ కర్నూలు జిల్లా చైర్మన్ అయ్యన్నగారు విలేకరులతో బుధవారం మాట్లాడుతూ ఏలూరు జిల్లా చక్కపల్లి చైతన్య ప్రైవేటు విద్యా పాఠశాల లో వేలకు వేలు డబ్బులు చెల్లిస్తూ తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి బాగో లేకపోయినా నాణ్యమైన విద్య అందుతుందన్న నమ్మకంతో పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారని అందులో భాగంగా ఎల్కేజీ చదువుతున్న విద్యార్థి డోల వైష్ణవి పై విచక్షణారహితంగా కొట్టిన చైతన్య స్కూల్ సిబ్బందిపై చర్యలు తీసుకొని వెంటనే సమగ్ర విచారణ జరిపి పాఠశాల యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులను ఆయన కోరారు.