నిర్లక్ష్యం వహించిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

 నిర్లక్ష్యం వహించిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

జమ్మలమడుగు, న్యూస్ వెలుగు ; కడప జిల్లా జమ్మలమడుగు మండలం మొరగుడి గ్రామం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సెంటర్ నందు రాష్ట్రమాల మహానాడు జాతీయ అధ్యక్షులు రామాజీ ఇమ్మానియేల్ మాట్లాడుతూ పీహెచ్సీ సెంటర్ నందు పనిచేసే డాక్టర్లు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నరాని  రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్ వస్తున్న కారణంగా మొరుగుడి పీహెచ్సీ సెంటర్ పరిధిలోని గ్రామాల్లో వైరల్ ఫీవర్ ఉన్న కారణంగా శాంపిల్స్ తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ అధికారిని వివరణ కోరగా మీరు ఏ గ్రామంలో అయితే వైరల్ ఫీవర్ ఉందో మీరు మాకు సమాచారం అందించండి అని ఆమె అనడం విడ్డూరమని  ఎందుకంటే ప్రతి గ్రామంలో ఒక క్యాంపును ఏర్పాటు చేసి శాంపిల్స్ సేకరించి వైరల్ ఫీవర్ వస్తుందా లేదా అనేది వారు చేసుకోవాల్సిన పనిని మమ్మల్ని చేసి సమాచారం ఇవ్వాలని  గవర్నమెంట్  జీతం ఇచ్చేది మాకా లేక మెడికల్ ఆఫీసర్ అధికారిక అనేది మాకు అర్థం కావడం లేదని  ఈ విషయంపై డిప్యూటీ డిఎం కు వినతి పత్రం ఇవ్వడం జరిగందని  ఆమె కూడా ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమని  ఈ విషయంపై త్వరలో రాష్ట్ర మాల మహానాడు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామమన్నరు.  డెంగి, మలేరియా వ్యాధులపై  అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలనన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!